పార్లమెంటు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చేతికి ఒక బ్రహ్మాస్త్రం దొరికింది. దీని సహాయంతో బిజెపిని ఇరుకున పెట్టే ప్రయత్నాలు మొదలైపోయాయి.
కర్ణాటకలో మాజీ ప్రధాని దేవి గౌడ మనవడు, ప్రస్తుత ఎంపీ ప్రజ్వల్ రేవన్న చాలా పెద్ద వివాదంలో ఇరుక్కున్నారు. వెయ్యి మందికి పైగా మహిళలతో శృంగారంలో పాల్గొన్న వీడియోలు బయటపడ్డాయి యువతల్ని లొంగదీసుకుని, కోరికలు తీర్చుకునేందుకు చాలా దారుణాలకు ఒడి కట్టినట్లు తెలుస్తోంది. బలవంతంగా దగ్గరవటం , ఆ వీడియోలు రికార్డ్ చేసి వాటిని చూపించి , బ్లాక్ మెయిల్ చేసి మరిన్ని సార్లు లైంగికంగా అత్యాచారాలకు దిగటం అలవాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోలన్నీ ఒక పెన్ డ్రైవ్ లో స్టోర్ చేసుకొని, దారుణాలకు తెగబడ్డూ. ఇప్పుడు ఆ పెన్ డ్రైవ్ బయటకు వచ్చేసింది. ఎంపీ ప్రజ్వల మీద అతని బంధువు ఒక బాధితమహిళా పోలీస్ ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది. నిజానికి బాధిత మహిళల కూడా ఆ కుటుంబానికి దగ్గర బంధువులే . ఎంపీ ప్రజ్వల్ నివాసంలో సుమారు 6 మంది మహిళలు పనిచేసేవారు, వారందరినీ కూడా లొంగదీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రాజకీయపరంగా కలిసే వారిని భయపెట్టి లొంగదీసుకునే వారని తెలుస్తుంది.
ఇప్పుడు ఈ వీడియోలు బయటకు రావడంతో కర్ణాటక తో పాటు భారతదేశం అంతటా కలకలం రేగుతోంది. ఎంపీ రేవంత్ ను అరెస్టు చేయాలని కర్ణాటక అంతా ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే అతను ఐరోపా ఖండాలకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది . అయినప్పటికీ అతన్ని పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.
మరోవైపు కర్ణాటకలో జేడీఎస్ తో పొత్తులో ఉన్నందున బిజెపికి కూడా ఇది తలనొప్పిగా మారింది. దీనిమీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం సమాధానం చెబుతారు అంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సూటిగా ప్రశ్నించారు. దీన్ని బట్టి ప్రజ్వల వీడియోలు విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అస్త్రంగా మలుచుకుంటుందని అర్థం అవుతుంది..