‘హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారాబ్రాహ్మణి బైక్ రైడ్ చేశారు. హిమాలయ సానువుల్లో మోటార్ సైకిల్ పై ఝూమ్మంటూ దూసుకెళ్లారు. మరికొందరితో ఆమె చేసిన బైక్ యాత్రకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలువురు యువపారిశ్రామికవేత్తలు సభ్యులుగా ఉన్న యంగ్ ప్రెసిడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ‘ ది లడక్ క్వెస్ట్’ పేరుతో ఈ యాత్రను నిర్వహించింది. ఆమె పసుపురంగు బైక్ నడిపారు. జావా యెడ్డీ మోటార్ సైకిల్స్ పేరుతో వైపీఓ తీసిన షార్ట్ ఫిల్మ్ లో యాత్రలో పాల్గొన్న వారంతా తమ అనుభవాలు షేర్ చేసుకున్నారు.
https://twitter.com/NtvTeluguLive/status/1598355755719172099?s=20&t=gasdkUpvnn-7kOj6Mb_w0Q