ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్కు అండగా నిలుస్తున్న తుర్కియ మరియు అజర్బైజాన్ దేశాల మీద భారతదేశమంతటా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మొన్నామధ్య తుర్కియాలో భూకంపం వచ్చినప్పుడు మొట్టమొదట స్పందించిన దేశం భారత దేశమే. పెద్ద మనసుతో భారీ విరాళం ఇచ్చి తుర్కియా దేశాన్ని భారత్ ఆదుకొంది. కానీ ఇప్పుడు అదే తుర్కియా దేశము భారత్ మీద దాడులు చేయండి అంటూ పాకిస్థాన్ కు మద్దతుగా నిలుస్తున్నది.
దీంతో తుర్కియా మరియు అజర్ భైజాన్ దేశాల ఉత్పత్తులని పూర్తిగా నిషేధించే దిశగా భారతీయ సమాజం కదులుతోంది. వాణిజ్య పరంగా ఈ రెండు దేశాలను దూరం పెట్టాలని స్వదేశీ జాగరణ్ మంచ్ పిలుపునిచ్చింది. ఈ రెండు దేశాలతో అన్ని ప్రయాణాలు, వాణిజ్యాన్ని నిలిపేయాలని కోరింది.
నిషేధానికి సంబంధించిన మార్గాలను కూడా స్వదేశీ జాగరణ్ మంచ్ సూచిస్తోంది.
ఇక.. తుర్కియా లో తయారైన రెడీమెడ్ దుస్తులను భారత్ లో దిగుమతి చేసుకోవద్దని సూచించింది. జారా, అడిడాస్, నైక్ వంటి పెద్ద పెద్ద విదేశీ రెడీమెడ్ దుస్తుల కంపెనీలను కూడా నిషేధించాలని, బహిష్కరించాలని సూచించింది. ఈ రెండు దేశాల పై తక్షణమే ఆర్థిక ఆంక్షలు, దిగుమతులపై నిషేధం విధించాలని డిమాండ్ చేసింది. ఇంకా గాను భారతీయ యువత ముందుకు రావాలని పిలుపునిచ్చింది ఆన్ లైన్ లో వస్తువులను కొనేముందు ఆయా దేశాల వివరాలు సరిచూసుకోవాలని సూచించింది.
మొత్తం మీద స్వదేశీ జాగరణ మంచ్ తీసుకున్న ఈ నిర్ణయానికి దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది.