బెంగాల్లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ వైపు రాష్ట్ంలో ఎన్నికల ప్రచారం హీటెక్కిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎవరో దుండగులు నాటు బాంబుల దాడులకు వేసిన ప్లాన్ కాస్త.. ఓ బాలుడి ప్రాణం తీసింది.బుర్దవాన్ ప్రాంతంలో సోమవారు నాడు ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఓ ఇద్దరు పిల్లలు ఆటలాడుకుంటుండగా.. వారికి ఓ ప్యాకెట్ కన్పించింది. అందులో ఉన్నవి నాటుబాంబులు అని తెలియక.. పిల్లలు వాటితో ఆటలాడుకోవడంతో అవి కిందపడి పేలాయి. దీంతో స్పాట్లోనే ఓ ఏడేళ్ల పిల్లాడు మృతిచెందాడు. మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు.