హన్మకొండ జిల్లాలో దారుణం జరిగింది. కాజీపేట పట్టణంలోని రైల్వే కాలనీలోని రైల్వే చిల్డ్రన్ పార్క్ సమీపంలో 6 సంవత్సరాల “చోటు” బాలుడిపై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతిచెండాడు. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఘటన జరిగినట్టు సమాచారం. యూపీకి చెందిన సంచారజాతి కుటుంబం కొంత కాలంగా కాజీపేట రైల్వే పరిసర ప్రాంతాల్లో ఉంగరాల తయారు చేసి అమ్ముకొని జీవిస్తోంది. ఉదయం బాలుడు చోటు బాత్రూమ్ కి వెళ్లగా అక్కడ కుక్కలున్నాయి. వాటిని చూసి బాలుడు భయంతో పరుగెత్తగా ఆవి వెంటబడి దాడిచేశాయి. తీవ్రగాయాలతో రక్తస్రావమై బాలుడిని చనిపోయాడు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ పర్యటన ఉండగా ఘటన నేపథ్యంలో వేసుకున్నారు.
ఆ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.