..
అసలు సిసలు స్వాతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించారు. అనేక కార్యాలయాలు, అసోసియేషన్ల దగ్గర బోస్ చిత్రపటాన్ని నిలిపి పూజలు జరిపారు.
జయంతి తప్ప వర్థంతి లేని వీరుడుగా సుభాష్ చంద్రబోస్ ని చెబుతారు. ఆయన మరణం ఒక మిస్టరీ గా మారటంతో వర్థంతి ఎప్పుడు అన్నది ఖరారు చేయటం లేదు. అందుచేత జనవరి 23నే ఆయన జయంతిగా పాటిస్తూ, ఆయన స్ఫూర్తిని గుర్తు చేసుకొంటూ ఉంటారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సోనాల లో నేతాజీ జయంతి వేడుకలు నిర్వహించారు. స్థానిక వివేకానంద స్కూల్ లో పిల్లలు, ఉపాధ్యాయులు నేతాజీ జయంతిని పాటించారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయులు నేతాజీ గొప్పతనాన్ని , పోరాట పటిమను పిల్లలకు తెలియపరిచారు. ఈ రోజుని జాతీయ పరాక్రమ దినోత్సవ్ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించి పాటిస్తోందని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఓరుగంటి కస్తూరి, ప్రిన్సిపాల్ కృష్ణ చైతన్య,ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
స్థానిక హౌసింగ్ బోర్డ్ శిశుమందిర్ లో తపస్ అదిలాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా కర్తవ్య భోద దివస్ ను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వలభోజు గోపిక్రిష్ణ మాట్లాడుతూ భారతీయులలో దేశభక్తిని, స్వాతంత్ర కాంక్షను రగిలించిన గొప్ప వీరుడు నేతాజీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వలభోజు గోపికృష్ణ, మెస్రం రాజ్ కుమార్, మనోజ్ రెడ్డి, వెంకట్ రాం రెడ్డి, మురళీ, దత్తాత్రి, రాజేశ్వర్,కేశవ్, గోపాల్, సంజీవ్,తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.