బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రెండురోజుల భారత పర్యటన ముగిసింది. మోదీ, బోరిస్ మధ్య శుక్రవారం జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. గత కాప్ సమావేశంలో చేసుకున్న వాగ్దానాలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నట్టు మోదీ తెలిపారు. ఆజాదీకా అమృతోత్సవాలు జరుపుకుంటున్న సమయంలో బోరిస్ భారత పర్యటనకు రావడం ఆనందించదగిన విషయమని మోదీ అన్నారు.భారత జాతీయ హైడ్రోజన్ మిషన్లో చేరాలని బ్రిటన్ను ఆహ్వానించారు మోదీ.
ఇంకా పలు అంతర్జాతీయ అంశాలపై ఇద్దరు చర్చించారు. ఇండో-పసిఫిక్ భద్రతా తోపాటు రష్యా, యుక్రెయిన్ ల మధ్య జరుగుతున్న యుద్ధ అంశం చర్చలో ప్రధానాంశాలుగా నిలిచాయి. అల్లాగే ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. రష్యా-యుక్రెయిన్ యుద్దాన్ని ఆపడానికి దౌత్యం ప్రాముఖ్యత గురించి.. అదేవిధంగా ఆఫ్గనిస్తాన్ లో ఉగ్రవాదుల అంశం కూడా చర్చకు వచ్చింది. గత సంవత్సరమే భారత్, యూకేలో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రారంభించాయని.. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన కార్యకలాపాలు జరుగుతున్నాయన్నారు మోదీ. రక్షణ రంగం, వాణిజ్యం, వాతావరణం, ఇంధన తదితర అంశాలపై బ్రిటన్ ప్రధానితో చర్చించారు మోదీ. మరోవైపు భారత్ కు నిర్దిష్ట ఓపెన్ జనరల్ ఎగుమతి లైసెన్స్ ని యూకే సృష్టిస్తోందని.. రక్షణ పరికరాల సేకరణలో జాప్యాన్ని తగ్గిస్తామని.. అలాగే బ్యూరోక్రసీని తగ్గిస్తుందన్నారు బ్రిటన్ ప్రధాని. భారతీయ వాక్సిన్ తమకు ఏంటో మేలు చేసిందన్నారు. అంతకు ముందు ఢిల్లీ లో రాష్ట్రపతి భవన్ వద్ద అధికార లాంఛనాలతో స్వాగతం లభించింది. ఇంతటి గొప్ప ఆహ్వానాన్ని ఎన్నడూ చూడలేదని బోరిస్ ఆనందం వ్యక్తం చేశారు.
భారత్ లో ఆర్ధిక నేరాలకు బ్రిటన్ లో తలదాలచుకుంటున్న నీరవ్ మోదీ, విజయ్ మాల్యా ప్రస్తావన కూడా వచ్చింది. భారత్ లో చట్టాల నుంచి తప్పించుకోవడానికి తమ దేశ న్యాయ వ్యవస్థను వాడుకోవడానికి అంగీకరించబోమన్నారు బోరిస్. ఇరు దేశాల ప్రధానుల చర్చలో భారత్ లో పెట్టుబడులు బ్రిటన్ లోని భారతీయులకు వీసాల సడలింపు వంటి అంశాలపై ప్రధానంగా భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది.