హిందువులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. హాయ్..నేను బోరిస్ జాన్సన్స్, మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. లీసెస్టర్ గోల్డెన్ లైట్లు వెలుగుతున్నాయి. సమోసాలు స్వీట్లు పంచుకుంటున్నారు. ఎంతో ప్రకాశవంతంగా, ఉత్తేజకరంగా ప్రజలు దీపాల వేడుక చేసుకుంటున్నారు. ఎంత అద్భుతమైన దృశ్యాలో. అనుభవైకవేద్యమిది. హిందువుల ఆరాధ్యదైవం శ్రీరాముడు…రావణుడిని చిత్తుగా ఓడించి., సీతతో అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు. వేల దీపాలు వెలిగించి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఈ క్షణాలు అద్భుతం అంటూ ట్వీట్ చేశారు బోరిస్ జాన్సస్. చెడుపై మంచి, నిరాశపై ఆశ, అజ్ఞానంపై జ్ఞానం. మీ విశ్వాసాలంటే మాకెంతో గౌరవం. బ్రిటన్ అంతటా శరత్ రాత్రులు ఎక్కువ కాలం ఉంటాయి. ఈ వాతావరణం ఇక్కడి వారిలో సరికొత్త మానసికర ఆనందాన్ని ఉల్లాసాన్ని, ఆశావాదాన్ని, ఆనందాన్ని కలుగజేస్తూ గొప్ప స్ఫూర్తినిస్తాయి. బాణసంచా కాలుస్తున్నారు. నిజంగా అందరం ఒకచోట చేసి జరుపుకునే వేడుక అని బోరిస్ అన్నారు.
బ్రిటిష్ నేలకు భారతీయులు అందించిన సేవలకు ధన్యవాదాలు చెప్పారాయన. భారతీయులు లేకుంటే బ్రిటన్ ఇలా ఉండేది కాదన్నారు. మీరు మా దేశం కోసం చేసే ప్రతిదానికీ… నా వ్యక్తిగత అభిమానాన్ని ,గౌరవాన్ని తెలుపుతున్నా. విజయవంతంగా వ్యాపారాలను నిర్వహించడం మొదలు.. ప్రముఖ శాస్త్రీయ పరిశోధనల వరకు, మా NHSలో ప్రజలకు సేవ చేయడం, మన పోలీసులు, మన సాయుధ దళాలు, ప్రతి మలుపులో మన దేశాన్ని మరింత సంపన్నంగా, ఆరోగ్యంగా, ఉదారంగా మరియు సురక్షితంగా మారుస్తాయి.అందుకని బ్రిటన్ లో , ప్రపంచవ్యాప్తంగా దీపావళిని జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు. సంతోషకరమైన, విజయవంతమైన రోజులు రావాలని కోరుకుంటున్న శుభ్ దీపావళి అంటూ బోరిస్ చేసిన ట్వీట్ భారతీయుల మనసుల్ని కట్టిపడేసింది.
బందీచోర్ దివస్ జరుపుకుంటున్న సిక్కులకు, జైనులకు దీపావళి శుభాకాంక్షలూ తెలిపారు బోరిస్..“నమస్తే, ఇక్కడ బోరిస్ జాన్సన్ ఉన్నారు, ఈ సంవత్సరం దివ్వెల పండుగను జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు . మనందరం ఓ పాండమిక్ పరిస్థితుల్ని దాటుకుని ఇవాళ బండిచోర్ దివస్, దీవాళీ జరుపుకుంటున్నాం. మీరు సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నానని ట్వీట్ చేశారు.
https://twitter.com/BorisJohnson/status/1456191017800146945?s=20