తవాంగ్ వద్ద… యాంగ్త్సే ప్రాంతంలో యథాతథ స్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) దళాలు వాస్తవాధీన రేఖను అతిక్రమించాయని, దీనిని మన రక్షణ దళాలు దీటుగా తిప్పికొట్టాయని చెప్పారు. 2022 డిసెంబరు 9న జరిగిన ఈ సంఘటనలో భారతీయ సైనికులెవరూ గాయపడలేదన్నారు.
పీఎల్ఏ దళాలు భారత భూభాగంలోకి చొరబడకుండా… భారత సైనికులు నిలువరించారని అన్నారు రాజ్ నాథ్. దీంతో చైనా తోకముడించిందని… పీఎల్ఏ దళాలు తిరిగి తమ స్థావరాలకు వెళ్లిపోయాయని వివరణ ఇచ్చారు. ఘర్షణల్లో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి తప్ప తీవ్రంగా ఎవరూ గాయపడలేదని..ఎలాంటి ప్రాణనష్ట జరగలేదని అన్నారు. ఇండియన్ మిలిటరీ కమాండర్స్ అప్రమత్తంగా ఉన్నారని…దేశ సరిహద్దుల రక్షణలో భారతదళాలు నిబద్ధతతో పనిచేస్తున్నాయని అన్నారు. చైనా సైనికులు ఘర్షణకు దిగడం గురించి చైనా వద్ద దౌత్య మార్గాల్లో ప్రస్తావించినట్లు తెలిపారు. మన రక్షణ దళాల ధైర్య సాహసాలకు పార్లమెంటు సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఆశిస్తున్నానన్న రాజ్ నాథ్… మన సైనికుల ధైర్యసాహసాలకు గౌరవ వందనం చేస్తున్నామన్నారు. అటు చైనా సైనికుల కర్రలదాడిలో ఆరుగురు సైనికులకుగాయాలైనట్టు సమాచారం. స్వల్ప గాయాల పాలైన వారిని వారిని గువాహటిలోని బసిష్టలో ఉన్న 151 బేస్ ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయించారు. ఈ ఘర్షణలో చైనా సైనికులు పెద్దఎత్తున గాయపడినట్టు సమాచారం.
https://twitter.com/ANI/status/1602552966711455745?s=20&t=q1YBUpcQLKQynZyR13akaQ