నేత్రవైద్య నిపుణులు డాక్టర్ గౌడ జనార్దన్ రచించిన ‘ఆనందమయ జీవితానికి ఆరోగ్యసాధన’ పుస్తకావిష్కరణ హైదరాబాద్ షేక్ పేటలోని జి. నారాయణమ్మ ఇంజినీరింగ్ కాలేజీలో జరిగింది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పతంజలి యోగా మఠం అధ్యక్షులు మాతా నిర్మల యోగభారతి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.నారాయణమ్మ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఛైర్మన్ సుబ్బారెడ్డి సభకు అధ్యక్షత వహించగా…ముఖ్యవక్తగా ఆర్ఎస్ఎస్ దక్షిణమధ్యక్షేత్ర సేవా ప్రముఖ్ ఎక్కా చంద్రశేఖర్ వ్యవహించారు. ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంలో భారతీయ జీవన విధానం ప్రాధాన్యతను తెలియచేస్తూ పుస్తక రచన చేసినట్టు డాక్టర్ జనార్దన్ తెలిపారు. ప్రతిఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో బాధ్యతగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మాతా నిర్మలయోగభారతి పిలుపునిచ్చారు. పూర్వీకులు సహన జీవన విధానాల ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగివారి ఐహిక, ఆధ్యాత్మిక జీవన లక్ష్యాలు సాధించారని గుర్తుచేశారు. నాటి జీవన విధానాన్ని నేడు కూడా పాటించేందుకు అవసరమైన శాస్త్రీయ సాధనా పద్దతులను సులువుగా, ఆచరణయోగ్యంగా అందరికీ అర్థమయ్యేలా పుస్తకంలో డాక్టర్ జనార్దన్ వివరించారని సుబ్బారెడ్డి అన్నారు. అలోపతి వైదఉండీ ఆయుర్వేదానికి ప్రాచుర్యం కల్పిస్తున్న జనార్దన్ గారి నుంచి నేటితరం, సమాజం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఎక్కా చంద్రశేఖర్ అన్నారు. ప్రకృతి వ్యవసాయం, గోఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న డాక్టర్ జనార్దన్ నేటితరానికి మరింత అవగాహన కల్పిస్తూ ఇలాంటి పుస్తకాలు తీసుకురావడం గొప్పవిషయమని డాక్టర్ సురేందర్ రెడ్డి అన్నారు. ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ విజయ గణేశ్వర్ రెడ్డి పుస్తక పరిచయం చేశారు. ఆర్ఎస్ఎస్ పరివార సంస్థలకు చెందిన పలువురు ప్రముఖులు, వైద్యనిపుణులు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.