మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై నాగపూర్ జైల్లో శిక్షననుభవిస్తున్న ప్రొఫెసర్ సాయిబాబాకు ఊరట లభిస్తుంది. ఆయన్ని నిర్దోషిగా తేల్చిన బాంబే హైకోర్టు …తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది.
మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో 2014లో డిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన సాయిబాబా, ఓ జర్నలిస్టు సహా ఐదుగురిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు మహారాష్ట్ర పోలీసులు. 2017లో సెషన్స్ కోర్టు వీరిని దోషులుగా తేలుస్తూ జీవిత ఖైదు విధించింది. అయితే శిక్షను సవాల్ చేస్తూ వారంతా బాంబే హైకోర్టులో అప్పీలుకు వెళ్లారు. హైకోర్టు నాగ్పూర్ బెంచ్ విచారణ చేపట్టింది. వారందరినీ నిర్దోషులుగా తేలుస్తూ కోర్టు ఇవాళ తీర్పువెలువరించింది. అరెస్టైన తరువాత 2014లో డిల్లీ యూనివర్సిటీ సాయిబాబాను సస్పెండ్ చేసింది.