నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఉద్రిక్తం నెలకొంది. స్థానిక అంబేద్కర్ నగర్లో శివాజీ మహా రాజ్ విగ్రహ స్థాపనను పోలీసులు అడ్డుకున్నారు. టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని… లేకుంటే శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయానివ్వబోమని వాళ్లు అడ్డుకున్నట్టు తెలిసింది. దీంతో స్థానిక యువత, బీజేపీ కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు .దీంతో పోలీసులు వాళ్లపై లాఠీచార్జి చేసి చెదరగొట్టారు.