ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ వంటి హిందూ సంస్థలపై ఆదిలాబాద్ లోని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపైనా ఆగ్రహించిన స్థానిక బీజేపీ నేరడిగోండ మండల నాయకులు, కార్యకర్తలు ఈరోజు అంబేద్కర్ కూడలి వద్ద ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు సోసయ్య హీరాసింగ్ మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో తాను ఓడిపోతున్నట్టు పీకే రిపోర్ట్ ఇవ్వడంతో మతిస్థిమితం కోల్పోయి ఎమ్మెల్యే ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. నిస్వార్ధంగా దేశ సేవ చేయాలనే ఆలోచన తప్ప తమ కుటుంబాలకు దూరంగా దేశమే తన కుటుంబంగా భరతమాత తమ తల్లిగా భావించే వాళ్ళ గురించి ఆయన తప్పుడు మాటలు మాట్లాడటం సమంజసం కాదని అన్నారు. ఎమ్మెల్యే మానసిక స్థితి బాగోలేదని ఒకసారి మంచి వైద్యుని పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే మంచిదని హితవు పలికారు. అనంతరం బీజేపీ ఓబీసీ మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి చొక్కపల్లి రాములు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఒకసారి తనతో ఆర్ఎస్ఎస్ శాఖకు రావాలని అప్పుడు ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడాలని.. కేవలం కొబ్బరికాయలు కొట్టడానికే పరిమితమయ్యారు తప్ప ఎక్కడా అభివృద్ధి చేయలేదని, వచ్చే ఎన్నికల్లో తనకు సీటు రాదని గ్రహించి ఏదోలా వార్తల్లో ఉండాలనే ఉద్దేశంతో ఇలా చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎస్ఐ మహేందర్ సంఘటన స్థలానికి చేరుకుని అక్కడ ఉన్న నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేసి పోలిస్ స్టేషన్ కు తరలించారు.
ఈ నిరసనలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి సాబ్లే సంతోష్ సింగ్, ఓబిసి మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు గట్టు నారాయణ, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు తమ్మల ఉదయ్, బీజేవైఎం మండల అధ్యక్షులు భాక్రే లక్ష్మణ్, కిసాన్ మోర్చ మండల కార్యదర్శి శ్రీధర్ రెడ్డి, గిరిజన మోర్చ మండల అధ్యక్షులు రాథోడ్ ఉద్దల్ సింగ్, బీజేపీ ఓబిసి మోర్చ మండల కార్యదర్శి బొంతుకుల శ్రీను, పోలింగ్ బూత్ అధ్యక్షులు ప్రశాంత్ సహా తదితరులు పాల్గొన్నారు.