తెలంగాణ రాష్ట్రంలో బీజేవైఎం పిలుపు మేరకు ఆదిలాబాద్ లోని బోథ్ మండల బీజేవైఎం తరపున నిరుద్యోగ భృతి కోసమై మండల తహసీల్దార్ కి వినతి పత్రం అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలలో నిరుద్యోగ భృతి ఒకటి. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు 3016/౼ నిరుద్యోగ భృతిగా ప్రతీనెల అందిస్తామని హామీ ఇచ్చి 40 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఏ ఒక్క నిరుద్యోగికి రూపాయి కూడా చెల్లించలేదు. కావున ప్రకటించిన నిరుద్యోగభృతి 40నెలల మొత్తాన్ని 1,20,640 రూపాయలు వెంటనే చెల్లించాలని కోరుతూ వినతి పత్రం స్థానిక బీజేవైఎం కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గొర్ల రాజు యాదవ్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి లాడేవార్ తుకారం, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు మనాల శేఖర్, జిల్లా కార్యదర్శి రంజిత్ సింగ్, జిల్లా కార్యవర్గ సభ్యులు జైపాల్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి తరుణ్, కార్యదర్శి విశాల్, రోహిత్, బీజేపీ ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు బారె బోజన్న బీజేవైఎం మండల నాయకులు కార్తిక్, సాయి సహా అరవింద్ పాల్గొన్నారు.