ప్రచారములో దూసుకెళుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్.
పల్లె పల్లెల్లో ప్రచార హోరు.
గులాబీ దండు కదిలింది.
బోథ్ నియోజక వర్గంలో బీఆర్ఎస్ నుండి పోటీలో అనిల్ జాదవ్ పోటీలో ఉన్నారు.
మరి పోటీలో ఉండి గెలుపు బాటలో పయనించ బోతున్నారు అని ఆయన అభిమానులు అనుచరగణం అంటున్న మాట,
యువకుడిగా రాజకీయ
రంగప్రవేశం చేసి ప్రజల మదిలో తన స్థానాన్ని పదిలం చేసుకొని ముందుకు సాగుతున్నారు.
బోథ్ నియోజక వర్గంలో కాంగ్రెస్ తరుపున రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒడిన మొక్కవోని దీక్ష తో ముందుకి సాగుతూ తనని నమ్ముకున్న కార్యకర్తలను దరి చేర్చుకొని అందరి కంటే ఎక్కువ కార్యకర్తలను పట్టించుకున్న నాయకుడుగా అనిల్ జాదవ్ బోథ్ నియోజక వర్గంలో ముందు ఉంటారు అనడంలో సందేహం లేదు.
మళ్ళీ ముచ్చటగా మూడో సారి పోటీ లో ఉండి గెలుద్దాము అనుకున్న సందర్భాల్లో కాంగ్రెస్ టికెట్ నిరాకరించడం తో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉండి లగడ పాటి సర్వేలో అనిల్ జాదవ్ గెలవబోతున్నాడు అని చెప్పి బోథ్ నియోజక వర్గంలో ఒక రకమైన వాతావరణాన్ని సృష్టించారు.
అయిన తాను ప్రజల మనసులు గెలిచి ఒంటరి పోరాటం చేసి అత్యధిక ఓట్లు సాధించిన ఓటమి పాలయ్యారు.
గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థి ఓడిపోవడంలో పరోక్ష కారణం కూడా అనిల్ జాదవ్ అనొచ్చు.
ఓటమికి కృంగి పోకుండా కష్టే ఫలి అన్న నానుడిని ఆదర్శంగా తీసుకొని భారతీయ రాష్ట్ర సమితిలో చేరి జెడ్పీటీసీ గా పోటీ చేసి కార్యకర్తల నిరంతర అంకుటిత దీక్షతో విజయ దరహాసన్ని స్వంతం చేసుకున్నారు. తాన గెలుపుతో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి దక్కుతుందని అందరూ అనుకుంటున్న సందర్భంలో త్రుటిలో ఆ అవకాశాన్ని చేజార్చుకున్నారు.
దీనికి కారణం ఆ పార్టీలోని కొందరు వ్యక్తుల వల్లే జడ్పీ చైర్మన్ అవకాశం పోయిందని అనిల్ జాదవ్ అభిమానులు గుసగుసలాడారు.
అయిన తాను కృంగి పోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతూ ప్రజల్లో అభిమానాన్ని చూరగొన్నాడు.
ఇటీవల తన జన్మదినాన్ని బోథ్ నియోజక వర్గంలో కని విని ఎరుగని రీతిలో తాన అభిమానులు ,కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇచ్చోడ లో జరపడంతో బోథ్ ఎమ్మెల్యేగా భారాస తరుపున విజయకేతనం ఎగిరేయబోతున్నామని అని అనాడే సంకేతాలు ఇచ్చారు.
అనిల్ జాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న సందర్భంలో ఒక సంఘటన జరిగింది.
అయన అనుచర గణం కాకుండా ఇతర వ్యక్తులు తన గెలుపు కోసం అహర్నిశలు శ్రమించారు అందులో
ఒక చిన్న ఉదాహరణ
ఒక గ్రామానికి చెందిన వ్యక్తి ఇతర పార్టీలకి వత్తాసు పలుకుతూ వాటికే ఓటు వేసే వ్యక్తుల్ని కూడా అనిల్ జాదవ్ సైడు ఆలోచించేలా చేసి
తన ఓటు తాను వేసే పార్టీకి వేసి తన కుటుంబంలోని ఇతర ఓట్లు అనిల్ జాదవ్ కి వేయాలి అని చెప్పిన సందర్భాలు కూడా ఎక్కువే ఇలా ఎవరికి వారు తమ తమ పనిని నిశబ్దంగా చేశారు అంటే అయన మీద నమ్మకం ఎంత ఉందో మన అంచనా వేయవచ్చు.
ఇలాంటి సంఘటనలు కోకొల్లలు.
అసలు ఆయనతో ఎప్పుడు కూడా ఉండని వ్యక్తులు అయన గెలుపుకోసం పని చేశారు అలా ఈ సారి కూడా పని చేస్తే గెలుపు రుచిని చూడొచ్చు అని బోథ్ నియోజక వర్గ ప్రజలు అంచనా వేస్తున్నారు.
అందుకే
ఇలా ఈసారి కూడా తాను పోటీలో ఉన్నాడు కావున అనిల్ జాదవ్
భారతీయ రాష్ట్ర సమితి నుండి టికెట్ పొంది ఈసారి బోథ్ గడ్డలో అనిల్ జాదవ్ విజయ కేతనం ఎగరేయబోతున్నారు అని ఆయన అభిమానులు అంటున్న మాట.
ప్రచారములో దూసుకెళుతున్న అనిల్ జాదవ్.
బోథ్ నియోజక వర్గంలో భారతీయ రాష్ట్ర సమితి తరపున అనిల్ జాదవ్ ప్రచారంలో అన్ని పార్టీల కంటే ముందున్నాడనడంలో సందేహం లేదు.
బిజెపి, కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటించకన్న ముందే కేసీఆర్ బిఆర్ఎస్ బోథ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అనిల్ జాదవ్ ని ప్రకటించాడు. అప్పటినుండే గ్రామ గ్రామాన పల్లె పల్లెన భారతీయ రాష్ట్ర సమితి కార్యకర్తలు శ్రేణులు పార్టీ ప్రచార బాధ్యతలను తమ భుజస్కంధాల మీద వేసుకొని కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను గడపగడపకు తీసుకెళ్తూ ప్రజలని
బి ఆర్ఎస్ కు ఓటేసేలా మమ్మురంగా ప్రచారం చేస్తున్నారు.
ఇటీవల కేటీఆర్ నిర్మలకు వచ్చిన సందర్భంలోనూ అనిల్ జాదవ్ నీ గెలిపిస్తే బోత్ నియోజక అభివృద్ధి మరింత జరుగుతుందని తెలిపారు.
అలాగే గ్రామాలలోనూ పట్టణాలలోనూ కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలు టిఆర్ఎస్ను గెలిపిస్తుందని గులాబీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు.
పల్లెల్లో పట్టణాలలో అనిల్ జాదవ్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కెసిఆర్ నా పెద్ద కొడుకు కెసిఆర్ కు ఓటు వేయకపోతే మేము ఎవరికి వెస్తము అని వృద్దులు సైతం టిఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నారు కానీ యువతలో నిరాశ నిస్పృహ ఎక్కువ ఉండడం వల్ల దానివల్ల ఏమైనా ఓట్లు కోల్పోవాల్సి వస్తుందని విశ్లేషకులు అంటున్న మాట.
మళ్లీ ఇటీవల బిజెపి కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన ప్రచారం అనేది మెల్లగా ఉంధి
కానీ పల్లెల్లో పట్టణములో గులాబీ దండు ప్రచారం జోరుగా సాగుతోంది.
చూడాలి ఈసారి అయిన అనిల్ అనితర సాధ్యంతో విజయ దరహాసం పొందుతార అనేది నిరీక్షించక తప్పదు.
బోథ్ లో సాగిన రెవెన్యూ డివిజన్ కొరకు సాధన సమితి ఆధ్వర్యములో రిలే నిరాహారదీక్షలు రెవెన్యూ డివిజన్ సాధన సమితి సుమారు 100 మందితో నామినేషన్లు వేయిస్తము అని అన్న సందర్బాలు కూడా ఉన్నాయి ఇలా నామినేషన్లు వేస్తే అధికార పార్టీ అభ్యర్థికి ఏమైనా ఓట్ల చీలిక జరిగే అవకాశం ఉంది అని బోథ్ వాసుల అభిప్రాయం.
బోథ్ లో ఎలాగైనా గెలవాలి అని ముందుకు సాగుతున్నారు అనిల్ జాదవ్.
గెలుపు బాటలో ప్రయాణిస్తారో లేదో వేచి చూడాల్సిందే.
– మునిగేల శ్రీధర్