ఖతార్లోని భారతీయ వలసకార్మికులపట్ల జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై ఆందోళన వ్యక్తం చేసింది ఆర్ఎస్ఎస్ అనుబంధ భారతీయ మజ్దూర్ సంఘ్. ముఖ్యంగా భారతీయులపై ఖతార్లో కొనసాగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన పట్ల తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని ఓ ప్రకటనలో పేర్కొందది.
“కఫాలా వ్యవస్థ ఖతార్లోని భారతదేశం తోపాటు ఇతర దక్షిణాసియా దేశాల కార్మికులకు తీవ్ర ఇబ్బందులను కలిగించింది. పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకోవడం, ఓవర్టైమ్ పని చేయించడం, కొంతకాలం బస చేయడానికి అనుమతి నిరాకరించడం, వసతుల లేమి, లైంగిక వేధింపులు, నైపుణ్యం ఉన్న రంగంలో కాకుండా వేరే రంగంలో బలవంతంగా పని చేయించడం వంటివి కార్మికులకు తీవ్ర మానసిక వేదనలకు మూలాలుగా ఉన్నాయి”అని BMS ప్రకటనలో పేర్కొంది.
2014 నుంచి దేశంలో 1,611 మంది భారతీయ వలసదారులు మరణించారు. స్వదేశంలో ఉన్న కుటుంబాలు తమ వాళ్ల డెడ్ బాడీస్ కోసం ఎంతో కాలం వేచిచూడాల్సి వస్తోందని ప్రకటనలో ప్రస్తావించింది.
ఖతార్ లోని వలస కార్మికుల సమస్యలపై దృష్టిని ఆకర్షించడానికి BMS భారతదేశంలోని ఖతార్ రాష్ట్ర రాయబారి, భారత కార్మిక మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు తమ నివేదికను కూడా సమర్పించింది. భారతీయ కార్మికులందరికీ ఆరోగ్యకరమైన పని పరిస్థితులు కల్పించాలని, వారి మానవ హక్కులను గౌరవించాలని డిమాండ్ చేసింది.
ఒక కార్మికుడు మరణించిన సందర్భంలో, మరణించిన వారి మృతదేహాలను వెంటనే భారతదేశానికి తిరిగి పంపాలని.. దానికి అయ్యే ఖర్చును ఖతార్ ప్రభుత్వం లేదా మ్యాన్పవర్ సప్లై ఏజెన్సీ భరించి తగిన నష్టపరిహారాన్ని అందించాలని సంస్థ డిమాండ్ చేసింది. ఏదైనా ఉల్లంఘనలు జరిగితే మ్యాన్పవర్ సప్లై చేసే ఏజెన్సీలపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేసింది. ఖతార్ ప్రభుత్వం ఈ సమస్యపై సానుకూలంగా చర్య తీసుకోకపోతే, BMS ఈ సమస్యను జాతీయ, అంతర్జాతీయ ఫోరమ్లలో లేవనెత్తుతామంది.
ఈ ఏడాది మే 27, జూన్ 11 మధ్య జరిగిన జెనీవాలోని అంతర్జాతీయ లేబర్ కాన్ఫరెన్స్ 110వ సెషన్లో BMS ఈ సమస్యలను ఖతార్ ప్రభుత్వ అధికారులు, ట్రేడ్ యూనియన్తో లేవనెత్తింది.