డిల్లీ టికారి సరిహద్దులో రైతు ఆందోళనలో పాల్గొన్న ఓ మహిళ కరోనాతో కన్నుమూసింది. దీంతో కొన్ని నెలలపాటు ఆమెతో ఆందోళనల్లో పాల్గొన్న రైతుల్లో కలకలం రేగింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన మోమితా రైతు ఉద్యమంలో ముందునుంచీ యాక్టివ్ గా ఉన్నారు. అంతేకాదు.. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఆమె ప్రచారం నిర్వహించారు.
అటు కొన్నినెలలపాటు ఆమె డిల్లీ సరిహద్దులో ఆందోళనల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 26న ఆమెకు కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో ఆమెను బహదూర్ గఢ్ లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ బెడ్ దొరక్కపోవడంతో రోహ్ తక్ లోని ఆస్పత్రులకు తరలించగా అక్కడా బెడ్లు దొరకలేదు. మళ్లీ బహదూర్ గఢ్ కే తీసుకువెళ్లారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ ఆమెచనిపోయింది.