అసెంబ్లీ ఎన్నికల ముంగిట కర్నాటకలో ఘోరం జరిగింది. బీజేవైఎం నాయకుడిని ప్రత్యర్థులు హత్యచేశారు. ధార్వాడ్ జిల్లా కోతూర్ లో ఈ ఘటన జరిగింది. ప్రవీణ్ కుమార్ ను అత్యంత కిరాతకంగా కత్తులతో పొడిచి చంపారు. తన వర్గీయులు, అవతలివాళ్లు ఘర్షణ పడుతుండగా… ప్రవీణ్ ఆపేందుకు వెళ్లాడు. అంతలోనే ప్రత్యర్థులు ఆయనను కత్తులతో పొడిచి చంపారు. రాత్రి ఒంటిగంటకు ఈ ఘటన జరిగింది. ఆయన్ని హుటాహుటిన ఎస్డీఎం ఆస్పత్రికి తరలించారు. ఉదయం 5 గంటలకు ప్రవీణ్ చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. ఇక ఘటనకు సంబంధించి నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న ఒకే దశలో జరగనున్నాయి. 13 ఓట్ల ఫలితాలు. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు జరిగిన ప్రవీణ్ హత్య కలకలం రేపుతోంది.
With deep anguish, we share the news of the murder of BJYM Dharwad Unit Executive Member & Kottur Gram Panchayat VP, Sri Praveen Kammar.
He was brutally murdered by suspected political rivals late last night.
BJYM demands immediate arrest of the killers & pray for his Sadgati. pic.twitter.com/eI6SW1nKEh
— Tejasvi Surya (@Tejasvi_Surya) April 19, 2023