బంగ్లాదేశ్ సంక్షోభం సమయంలో భారతదేశం ఆచితూచి అడుగులు వేసింది. మన దేశ ప్రయోజనాలు ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈశాన్య రాష్ట్రాలు హర్షిస్తున్నాయి. తాజాగా త్రిపురలో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో బిజెపికి భారీ మెజారిటీ దక్కింది.
ఒకప్పుడు త్రిపుర ను కమ్యూనిస్టుల అడ్డాగా చెప్పేవారు. భారతదేశం మొత్తం మీద పశ్చిమ బెంగాల్ కేరళ తర్వాత ఎక్కువ కాలం కమ్యూనిస్టులు పరిపాలన చేసిన రాష్ట్రంగా త్రిపుర ని చెప్పవచ్చు. కమ్యూనిస్టులు మాటలు తప్ప చేతల్లో ప్రజలకు ఉపయోగపడటం లేదు అని జనం గుర్తించాక కామ్రేడ్ లను ఇంటికి పంపించేశారు అప్పటినుంచి త్రిపుర లో బిజెపి బలపడుతూ వస్తోంది.
బంగ్లాదేశ్ సంక్షోభం తర్వాత కూడా త్రిపురలో బిజెపి హవా ఇంకా పెరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలలో బిజెపి తిరుగులేని ఆదిపత్యం నిరూపించుకుంది. మొత్తంగా చూసుకుంటే 97.5% స్థానాలను బిజెపి గెలుచుకోవడం విశే షం. జిల్లా పరిషత్తులు బిజెపికి 80 దక్కగా కాంగ్రెస్ కు రెండు మాత్రమే మిగిలాయి. పంచాయితీ సమితిలో అంటే మన భాషలో చెప్పాలి అంటే మండల పరిషత్తులు.. బిజెపికి 318 దక్కగా,, కమ్యూనిస్టులకు 5 కాంగ్రెస్ కు ఒక్కటంటే ఒకటి మాత్రమే మిగిలింది.
ఇక గ్రామపంచాయతీల విషయంలో కూడా కమలం పార్టీ అదిరిపోయే దూకుడు ప్రదర్శించింది. 5,154 గ్రామ పంచాయతీలను బిజెపి గెల్చుకుంది. మరో ఎన్డీఏ పార్టీ అయినా తిపర కు 95 స్థానాలు దక్కాయి. కాంగ్రెస్ కు 67 కమ్యూనిస్టులకు 57 మాత్రమే దక్కడం గమనార్హం.
మొత్తం మీద ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వం మీద ప్రగాఢమైన విశ్వాసంతో ఉన్నారు అని ఈ ఫలితాలతో అర్థం అవుతోంది. ఈశాన్య రాష్ట్రాలలో అభివృద్ధిని సాకారం చేసిన ఘనత కేవలం బిజెపి పార్టీకి మాత్రమే దక్కుతుంది అని మరోసారి రుజువయింది.