బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బీజేపీ కార్యకర్తలపై దాడులు పెరుగుతున్నాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. గత కొద్ది రోజులుగా వరుసగా బీజేపీ నేతలే లక్ష్యంగా నాటుబాంబులతో దాడులు జరుగుతుండగా.. తాజాగా కుచ్బిహార్లో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. బీజేపీ మండల అధ్యక్షుడు దిన్హాతలోని పార్టీ కార్యాలయం వెనుక శవంగా కన్పించాడు. దీంతో అదిచూసిన అంతా షాక్కు గురయ్యారు. ఈ ఘటనపై స్సందించిన బీజేపీ అధికారులు.. ఇది పక్కా ప్రీ ప్లాన్ మర్డర్ అని ఆరోపించారు. టీఎంసీ పార్టీకి చెందిన గుండాలే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని.. బీజేపీ కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేసేందుకు ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
https://twitter.com/ANI/status/1374588590118735874