మహారాష్ట్ర లో ఠాక్రే సర్కారుకు గట్టిషాక్ తగిలింది. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా 3 స్థానాలు గెలుచుకుంది. అధికార మహా వికాస్ అఘాడీకి ఇది గట్టిదెబ్బేనని చెప్పవచ్చు. మహాలో మొత్తం ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగగా…
కూటమి 3 స్థానాలు గెలుచుకుంది. విపక్ష బీజేపీ 3 స్థానాలు గెలుచుకుంది.
ఆయా స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగ్గా..అవకతవకలు జరిగాయంటూ కౌంటింగ్ ను అడ్డుకుంది బీజేపీ. అయితే ఎన్నికల సంఘం ఆదేశంతో అర్థరాత్రి కౌంటింగ్ మొదలుపెట్టారు.తెల్లవారుజామున ఫలితాలు వెలువడ్డాయి.
బీజేపీనుంచి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, రాష్ట్ర మాజీ మంత్రి అనిల్బోండే,ధనుంజయ్ మహాదిక్ గెలిచారు. అసలైతే సంఖ్యాబలం పరంగా బీజేపీ రెండుస్థానాలే దక్కించుకోవాలి..కానీ అనూహ్యంగా మూడో సీటునూ కైవసం చేసుకుంది విపక్షబీజేపీ.