ఉత్తర ప్రదేశ్ లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొన్ని అద్భుతాలు చేస్తూ ఉంటారు. మొన్నటి అసెంబ్లీ ఉప ఎన్నికలలో కూడా అటువంటి గమ్మత్తు సాధించారు.
అక్కడ కుందార్కీ నియోజకవర్గం.. యావత్ దేశంలోనే హాట్ టాపిక్ గా మారింది. అక్కడి ఉప ఎన్నికలో అద్భుతం చోటు చేసుకుంది. ఆ నియోజకవర్గం నుంచి స్వతంత్య్రులతో పాటు అన్ని పార్టీల నుంచి ముస్లీం అభ్యర్థులే బరిలోకి దిగారు. ఎందుకంటే ఇక్కడ ఓటర్లలో 70% పైగా ముస్లింలే. 20 ఏళ్లుగా ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది. అందుచేత గడచిన పాతిక ఏళ్లుగా ముస్లింలకే పార్టీలు టికెట్లు ఇస్తున్నాయి.
బీజేపీ నుంచి హిందూ అభ్యర్థి రాంవీర్ సింగ్ ఒక్కరే పోటీ చేశారు. మొత్తం 12 మంది లో 11 మంది ముస్లీంలే. కానీ ఆ ముస్లీం అభ్యర్థులు.. రాంవీర్ సింగ్ దరిదాపుల్లో కూడా లేరు. రాంవీర్.. ఏకంగా లక్షకు పైగా మెజార్టీ సాధించారు. సమాజ్ వాదీ నుంచి 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న హాజీ అహ్మద్ రిజ్వాన్ పోటీ చేశారు.
ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని సమాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపిస్తున్నారు. కానీ ఇక్కడ బిజెపి వ్యూహం ఆసక్తికరంగా నిలుస్తోంది. ముస్లిం సమాజంలోని కుల సమీకరణాలను వాడుకుంది. అక్కడ తురకలు,, షేకులు అనే రెండు ముస్లిం కమ్యూనిటీలు ఉంటాయి. తురక ముస్లిం లు అగ్రకులాలుగా భావించుకొంటూ,, షేకులను చిన్నచూపు చూస్తారు. మూడుసార్లుగా గెలుస్తున్న తురక కమ్యూనిటీ నుంచే పదిమంది ముస్లిం అభ్యర్థులు నామినేషన్ వేశారు. అక్కడ దిగువ శ్రేణి పౌరులుగా ఉన్న షేకులకు ఇది అవమానకరంగా నిలుస్తోంది. ఏ పార్టీ కూడా షేకులను దగ్గరకు తీసుకోవడం లేదు. గతంలో రెండుసార్లు ఓటమి చవి చూసిన బిజెపి అభ్యర్థి రామ్ వీర్ సింగ్ వ్యూహాత్మకంగా షేక్ లకు దగ్గరయ్యారు. దీంతో తురకల ఓట్లు అన్నీ చీలిపోగా.. షేక్ ల ఓట్లన్నీ బిజెపికి పడ్డాయి.
మరోవైపు మూడుసార్లుగా సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న సమాజ్ వాదీ అభ్యర్థి హాజీ అహ్మద్ అహంకారానికి మారుపేరుగా నిలుస్తున్నారు. ఇటు రాంవీర్ సింగ్ తెలివిగా ఉర్దూ కూడా నేర్చుకుని,, బీద మధ్యతరగతి ప్రజలకు అండగా నిలబడ్డారు. అవసరం కోసం వచ్చే ప్రజలకు సహాయపడుతూ ప్రభుత్వ పథకాలను అందిస్తూ వచ్చారు. దీంతో ప్రజల మనసు గెలుచుకుని ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
యోగి ఆదిత్యనాథ్ రాజకీయ చతురతకు ఈ ఎన్నిక ఒక ఉదాహరణ.