అవినీతి, కుటుంబ రాజకీయాలపై బీజేపీ పోరాడుతుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అవినీతి, ఆశ్రితపక్షపాతం, శాంతిభద్రతల సవాళ్ల నుంచి దేశాన్ని విముక్తం చేసేందుకు నిబద్ధతతో కృషిచేస్తామన్నారు. బీజేపీకి అన్నింటికన్నా దేశం ముఖ్యమన్న మోదీ హనుమంతునిలాగా భారత్ నేడు తన శక్తిషామర్థ్యాలను తెలుసుకుంటోందన్నారు. హనుమాన్ పాటించిన విలువలనుంచి బీజేపీ, పార్టీ కార్యకర్తలు నిరంతరం ప్రేరణ పొందుతున్నాయన్నారు.పార్టీ 43వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ ఎంపీలనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ప్రతిపక్ష పార్టీలు కుటుంబ, కులతత్వ పార్టీలన్న ప్రధాని…వాళ్లంతా 2014 నుంచి ఈ దేశం సాధిస్తున్న ప్రగతిని, పేదలకు తాము చేస్తున్న సేవలను హేళన చేస్తున్నారని మండిపడ్డారు.