కేరళలో చిరకాల పోరాటం ఫలించి బిజెపి తొలిసారి గెలిచిన అసెంబ్లీ నియోజకవర్గం నేమం. 2016లో సీనియర్ నేత ఒ. రాజగోపాల్ బిజెపి అభ్యర్థిగా విజయఢంకా మోగించారు. ఈసారి కుమ్మనం రాజశేఖరన్ కమలం పార్టీ నుంచి బరిలోకి దిగారు. ఈయన 2019లో తిరువనంతపురం నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. గతంలో మిజోరం మిజోరం గవర్నర్ గా పనిచేశారు. 2016లో బిజెపి ఏకంగా 47.5 శాతం ఓట్లు సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి రాజగోపాల్ 67,813 పొందగారు. సిపిఎం అ్యర్థి శివన్ కుట్టి 59,142 ఓట్లు పొందారు. మొత్తం మీద 8,6,71 ఓట్ల మెజారిటీతో బిజెపి తొలివిజయం అందుకుంది. ఈసారికూడా తమదే గెలుపని కమలనాథులు ధీగాతో ఉన్నారు. ప్రత్యర్థులు సిపిఎం, కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ అగ్రవర్ణ హిందూ నాయర్ లకు టికెట్లు ఇచ్చాయి.
నేమంలో బిజెపిని ఓడించడం అంత సులభం కాదని కేరళలో దాదాపు అన్ని పార్టీల నాయకులూ చెప్తున్నారు. ఇది రాజధాని తిరువనంతపురం లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఉంది. 2019లో బిజెపి లోక్ సభ ఎన్నికల్లో ఓడినా నేమంలో మాత్రం ఆధిక్యం సాధించింది. తిరువనంత పురం మునిసిపల్ కార్పొరేషన్ లోని 23 డివిజన్లు నేమం నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ 23 డివిజన్లకు గాను 14 సీట్లను బిజెపి గెల్చుకుంది. మిగిలిన 9 సీట్లను అధికార ఎల్ డిఎఫ్ కూటమి గెల్చుకుంది. అంటే ఐదేళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో, రెండేళ్ల క్రితం లోక్ సభ ఎన్నికల్లో కూడా నేమంలో బిజెపిదే హవా అని తేలిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటింది. రెండోసారి విజయంపై కమలనాథుల ధీమాకు కారణం ఇదే.