గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనాతా పార్టీ ప్రభంజనం సృష్టించింది. అఖండ విజయం దిశగా అడుగుస్తోంది. ఆ క్రమంలో రికార్డుల మీద రికార్డులు. ఇప్పటివరకు 152 స్థానాల్లో ఆ పార్టీ విజయపతాకం ఎగురవేసింది. కౌంటింగ్ తుదిఫలితాలనాటికి ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇక ఈ ఎన్నికల్లో ఆ పార్టీ సీట్లతో పాటు గణనీయమైన ఓట్లనూ ఖాతాలో వేసుకుంది.దాదాపు 55 శాతానికై పైగా ఓట్లు కమలంపార్టీకే వచ్చాయి.
గుజరాత్ రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి ఏ పార్టీకి ఇన్ని సీట్లు, ఇన్ని ఓట్లు మరో పార్టీకి రాలేదు. 1995 నుంచి నేటివరకూ జరిగిన అన్ని ఎన్నికల్లోనూ గెలిస్తూ వస్తున్న కాషాయపార్టీ ..ఏడోసారీ గెలవడం ద్వారా పశ్చిమబెంగాల్లో కమ్యూనిస్టు పార్టీ పేరిట ఉన్న రికార్డును సమం చేసింది.