కేరళ క్రైస్తవులకు బీజేపీ తీపి కబురు.. పినరయ్కి ఇక కష్టమేనా..?
కేరళ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అక్కడ పినరయ్ విజయన్ ప్రభుత్వంపై కొంత
వ్యతిరేకత ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం అక్కడ బీజేపీ ఎలాగైనా అధికారం చేపట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందుకు రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతూ.. ర్యాలీలు,బహిరంగ సభలను ఏర్పాటు చేస్తోంది. ప్రముఖులను రాజకీయాల్లోకి ఆహ్వానిస్తూ.. అందరినీ కలుపుకుపోతుంది. అయితే కేరళలో మతపరంగా క్రైస్తవులు, ముస్లింల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అయితే అక్కడి క్రైస్తవ సమాజానికి చెందిన యువతులు లవ్ జిహాద్ కుట్రలకు బలవుతున్నారు. ఇప్పటికే కేరళలో పెద్ద సంఖ్యలో లవ్ జిహాద్ సంఘటనలు ఉన్నాయి. పలు క్రైస్తవ సంస్థలు ఈ లవ్ జిహాద్పై చట్టం చేయాలని.. యువతులను లోబరుచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బహిరంగంగానే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
అయితే పినరయ్ విజయన్ సర్కార్ మాత్రం వీరి డిమాండ్లను పెడచెవిన పెడుతోంది. అయితే ఇప్పటికే బీజేపీ పరిపాలిస్తున్న పలు రాష్ట్రాల్లో ఈ లవ్ జిహాద్కు చెక్ పెట్టేందుకు లవ్ జిహాద్ నిరోధక చట్టాన్ని తీసుకొచ్చాయి. కేరళలో బీజేపీని గెలిపిస్తే.. లవ్ జిహాద్ నిరోధక చట్టాన్ని తీసుకు వస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే.సురేంద్రన్ హామీ ఇచ్చారు. కేరళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున క్రైస్తవ యువతులు లవ్ జిహాద్ వలలో పడిపోతున్నారు. ఈ లవ్ జిహాద్పై కఠిన చర్యలు తీసుకోవాలని క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ఇస్తున్న హామీ క్రైస్తవులకు తీపికబురుగా మారింది.