భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు గా జేపీ నడ్డా పదవీకాలం ఈనెల 30న ముగుస్తుంది. ఆ బాధ్యతల నుంచి ఆయనను తప్పించడం ఖాయం అన్నమాట వినిపిస్తోంది. అందుకోసమే కేంద్ర మంత్రివర్గంలోకి నడ్డా ను తీసుకున్నారు.
2014లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టారు. ఆయన ముఖ్య అనుచరుడు అమిత్ షా బిజెపి అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్నారు. 2014 19 మధ్య కాలంలో బిజెపిని పరుగులు పెట్టించిన ఘనత అమిత్ షాది. 2019 ఎన్నికల తర్వాత జెపి నడ్డాను మొదట కార్యనిర్వాహక అధ్యక్షునిగా తీసుకున్నారు నెమ్మదిగా బాధ్యతలు బదిలీ చేశారు అనంతరం 2020లో పూర్తికాలపు అధ్యక్షునిగా ఆయన బాధ్యతను తీసుకున్నారు. జెపి నడ్డ పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పటికీ కీలక నిర్ణయాల సమయంలో అమిత్ షాను సంప్రదించే వారిని చెబుతుంటారు.
మూడోసారి ప్రధానమంత్రి అయ్యాక పార్టీ వ్యవస్థను ప్రక్షాళన చేయబోతున్నారు. ఇందుకు తగినట్లుగా పార్టీ అధ్యక్ష బాధ్యత నుంచి తప్పించారు. ఆయన స్థానంలో అనేకమంది సీనియర్ల పేర్లు వినిపిస్తున్నాయి.
కానీ ఈసారి పార్టీ అధ్యక్ష బాధ్యతలు మహిళలకు ఇస్తారు అని టాక్ నడుస్తోంది
మొన్నటి ఎన్నికల్లో తక్కువ మెజార్టీతో ఓడిపోయిన మృతి ఇరానీకి అధ్యక్ష పదవి అప్పగిస్తారు అని చెబుతున్నారు ఇందుకు కొన్ని కారణాలు కనిపిస్తుంది.
భారతీయ జనతా పార్టీ కులాల కుమ్ములాట నుంచి బయటపడాలని కోరుకుంటున్నాను. అందుచేత కులాలవారీగా ఓట్లు అడిగే పరిస్థితి లేదు. మహిళలను ప్రసన్నం చేసుకుంటే కులాల అతీతంగా స్త్రీలంతా ఓట్లు వేస్తారని భావిస్తున్నారు.
ఇప్పటికే రాష్ట్రపతిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము ని గెలిపించుకున్నారు. అదే మాదిరిగా పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్మృతి ఇరానీకి అప్పగిస్తే గౌరవం పెరుగుతుంది అని భావిస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రతిపక్షాల మీద విరుచుకుని పడడంలో స్మృతి తి ఎప్పుడు ముందుంటారు. అందుచేత పార్టీని దూకుడుగా నడిపించడం సాధ్యం అవుతుందని అంచనా వేస్తున్నారు. త్వరలోనే పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొని రావాలని కమల నాధులు భావిస్తున్నారు.
మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తీసుకొచ్చినట్లైతే దేశ వ్యాప్తంగా పాత నాయకుల్ని పక్కన పెట్టేయడం సాధ్యం అవుతుంది. కొత్త తరం ముఖ్యంగా మహిళలకు నాయకత్వం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈలోగా బీజేపీ పరంగా మహిళా నాయకత్వాన్ని పటిష్టం చేసుకునేందుకు స్మృతి ఇరానీ నాయకత్వం ఉపయోగపడుతుందని కమలనాథులు అంచనా వేస్తున్నారు.
త్వరలోనే స్మృతి ఇరానీ పేరుని బిజెపి అధ్యక్ష పదవికి ప్రతిపాదిస్తారు అని తెలుస్తోంది. ఈలోగా పార్టీ పరంగా జాతీయ కార్యవర్గం లోకి ముఖ్యమైన నాయకుల్ని తీసుకునే అవకాశం ఉంది. పార్టీ బాధ్యతలు చేపట్టిన నాయకులు పూర్తిస్థాయిలో పార్టీ పని చేయాలని అగ్ర నాయకత్వం ఆశిస్తోంది.