5 రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్న వేళ..కీలకమైన యూపీలో తిరిగి అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ వేగంగా కదులుతోంది. తొలి దశ ప్రచారానికి ప్రధాని మోదీ సహా పలువురు సీనియర్లు రంగంలోకి దిగుతున్నారు. మొత్తం 30మంది స్టార్ క్యాంపెయినర్లతో జాబితా విడుదల చేసింది పార్టీ. ప్రధాని మోదీ, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, అమిత్షా, నితిన్ గడ్కరి, స్వతంత్ర దేవ్ సింగ్, ధర్మేంద్ర ప్రధాన్, యోగి ఆదిత్యనాథ్, రాధా మోహన్ సింగ్, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి, స్మృతి ఇరానీ, కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మ, సంజీవ్ బల్యాన్, జస్వంత సైని, హేమమాలిని, అశోక్ కటారియా, సురేంద్ర నగర్, జనరల్ వీకే సింగ్, చౌదరి భూపేంద్ర సింగ్, బీఎల్ వర్మ, రాజ్వీర్ సింగ్ , ఎస్.పి.సింగ్ బఘెల్, నిరంజన్ జ్యోతి, కె.కర్దమ్, రజినీకాంత్ మహేశ్వరి, మోహిత్ బెనివాల్, ధర్మేంద్ర కశ్యప్, జేపీఎస్ రాథోర్, భోలా సింగ్ ఖటీక్ పేర్లు జాబితాలో ఉన్నాయి.