గోవా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 34 మంది అభ్యర్థుల తొలిజాబితాను విడుదల చేసింది బీజేపీ. సీఎం ప్రమోద్ సావంత్ సాంక్వెలిమ్ నుంచి, డిప్యూటీ సీఎం మనోహర్ అజ్గాంకర్ మార్గోవ్ నుంచి పోటీ చేయనున్నారు. దివంగత సీఎం మనోహర్ పరీకర్ కుమారుడు ఉత్పల్ కు బీజేపీ టికెట్ నిరాకరించిన సంగతి తెలిసిందే. ఉత్పల్ పనాజీ సీటు కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. అయితే ఉత్పల్ రెండు ఆప్షన్లు పెట్టుకున్నారని పనాజీనుంచి ఆయనకు టికెట్ ఇవ్వడం లేదని…..మరోదానిపై చర్చ జరుగుతోందని గోవా ఎన్నికల ఇన్ చార్జ్ దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు.
అటు బీజేపీ టికెట్ నిరాకరించిన ఉత్పల్ కు తాము టికెట్ ఇస్తామని ఆఫర్ చేశారు కేజ్రీవాల్. దీనిపై ఉత్పల్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.