తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ విసురుతూ బహిరంగ లేఖ రాశారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా), మహిళా స్వయం సహాయక సంఘం (ఎస్హెచ్జీ)లకు ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ బకాయిలు రూ.4 వేల కోట్ల వరకు పేరుకుపోయాయన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలకు 4 వేల కోట్ల వడ్డీ బకాయిలు విడుదల చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. 2021-22 బడ్జెట్ లో మహిళా గ్రూపులకు వడ్డీ చెల్లించేందుకు 3 వేల కోట్లు కేటాయించినా విడుదల కాలేదన్నారు, అలాగే 2022-23 బడ్జెట్ లో 1250 కోట్లు కేటాయించినా ఇప్పటి వరకు నిధులు విడుదల కాలేదన్నారు. టీఆర్ఎస్ ఎనిమిదేళ్ల పాలనలో డ్వాక్రా గ్రూపులను నిర్వీర్యం చేశారని విమర్శించారు.