హిందూ పండగల ఊరేగింపులపై రాళ్లు విసిరేందుకు భారతీయ జనతా పార్టీ సభ్యులు నిరుపేద ముస్లిం యువతను అద్దెకు తీసుకుంటున్నారని, వారికి డబ్బులు ఇస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు.
ఈ విషయమై తనకు కొన్ని ఫిర్యాదులు అందాయని.. వాటిని ఇంకా ధృవీకరించలేదనీ చెప్పుకొచ్చారు. ఈ ఫిర్యాదుల ప్రకారం, బిజెపికి చెందిన కొందరు నాయకులు పేద ముస్లిం యువతకు రాళ్లు రువ్వడానికి డబ్బు చెల్లిస్తున్నారని..త్వరలోనే పూర్తి సమాచారం తీసుకుని… సమస్యను లేవనెత్తుతాననీ వ్యాఖ్యానించారు.
https://twitter.com/PadmajaJoshi/status/1518953019114668033?s=20&t=5l4sGE98vpGIw3Kc77QQvw
మధ్యప్రదేశ్ లోని ఖర్గోన్ తలాబ్ చౌక్ ప్రాంతంలో ఏప్రిల్ 10న రామనవమి ఊరేగింపుపై రాళ్లదాడి జరిగింది. తరువాత అల్లర్లు చెలరేగాయి.అనేక వాహనాలకు, ఇళ్లకు నిప్పంటించడంతో అల్లర్లు పెరిగాయి. ఆరుగురు పోలీసులు సహా 24 మందికి గాయాలయ్యాయి. అల్లర్లు జరిగిన మరుసటి రోజు ఖర్గోన్ అధికారులు అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంది. వారికి చెందిన అక్రమనిర్మాణాలను బుల్డోజర్ తో కూల్చేసింది. ఇందుకోసం ఐదు జేసీబీలను వినియోగించారు. అలాగే ఈ కేసులో 77 మందిని ప్రభుత్వం అరెస్టు చేసింది.
ఢిల్లీ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో రామనవమి ఊరేగింపుపై దుండగుల దాడులు కొనసాగాయి. ఏప్రిల్ 16న భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో హనుమాన్ జయంతి ఊరేగింపులపై దాడులు జరిగాయి. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో ఇస్లాంవాదులు హనుమాన్ శోభా యాత్రపై దాడి చేశారు. దుండగులు హనుమంతుడి విగ్రహంపై బీరు సీసాలు విసిరి హిందూ దేవుళ్లను దూషించారు.
గతంలోనూ ‘హిందూ టెర్రర్’ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ నేత దిగ్విజయ్సింగ్ అనేక ప్రయత్నాలు చేశారు. 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భోపాల్ నియోజకవర్గం నుంచి సింగ్పై సాధ్వి ప్రగ్యాను పోటీకి దింపాలని నిర్ణయించుకున్నప్పుడు…రాజకీయ వ్యూహంగా ‘హిందూ టెర్రర్’ అనే తప్పుడు వాదనలు సృష్టించాడు. అతను హిందూ నాగరికతను ‘ఉగ్రవాదులు’ అని లేబుల్ చేసాడు. 2008 మాలేగావ్ పేలుళ్లకు సాధ్వి ప్రగ్యాహస్తం ఉందని నిందించారు.
ముంబైపై 26/11 ఉగ్రదాడిని హిందువులు, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సభ్యులు చేశారని ఆరోపిస్తూ సింగ్ ఆ తర్వాత ఒక పుస్తకాన్ని కూడా విడుదల చేశారు. 26/11 ఉగ్రదాడి సమయంలో మహారాష్ట్ర ఏటిఎస్ చీఫ్ హేమంత్ కర్కరే మరణాన్ని హిందూ సంస్థ నుంచి తనకు వచ్చిన కొన్ని బెదిరింపులతో లింక్ చేయడానికి సింగ్ ప్రయత్నించినట్లు నివేదించబడింది.
“2008 మాలెగావ్ పేలుడుపై ATS దర్యాప్తును వ్యతిరేకిస్తున్న హిందూ తీవ్రవాద గ్రూపుల నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని తీవ్రవాద దాడికి రెండు గంటల ముందు కర్కరే నాకు చెప్పారు,” అని సింగ్ చెప్పాడు. అజీజ్ బర్నెట్ రాసిన ’26/11 RSS కి సాజిష్’ పుస్తకాన్ని దిగ్విజయ్ సింగ్ ఆవిష్కరించారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)