రాష్ట్రపతి అభ్యర్థిగా విపక్షాలు యశ్వంత్ సిన్హాను ఏకగ్రీవంగా ఎంపికచేశాయి. ఇక అధికార పార్టీ అభ్యర్థి ఖరారు కావల్సి ఉంది. అభ్యర్థి ఎంపికపై చర్చించేందుకు సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సాయంత్రం సమావేశం అవుతోంది. తమ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలనే దానిపై బీజేపీ తీవ్ర కసరత్తే చేస్తోంది. ఇక కీలక సమావేశానికి ముందు పార్టీ చీఫ్ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిశారు.
రాష్ట్రపతి ఎన్నికపై ప్రతిపక్ష పార్టీలతో సహా వివిధ పార్టీలతో మాట్లాడేందుకు రాజ్ నాథ్ , నడ్డాలకు కూడా పార్టీ అధికారం ఇచ్చింది. రాత్రి 7 గంటలకు జరిగే సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్ఖిని ఖరారు చేసి ప్రకటించవచ్చని భావిస్తున్నారు. జూలై 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఎన్డీఏకు 48శాతం ఓట్లున్నాయి.