రెండురోజుల బీజేపీ పదాధికారుల సమావేశాలు మొదలయ్యాయి. ఢిల్లీలోని కేంద్రకార్యాలయంలో జరుగుతున్న సమావేశానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ , కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, డీకే అరుణ , మురళీధరరావు , పొంగులేటి సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు ఇంద్రసేనారెడ్డి , జితేందర్ రెడ్డి , ఈటల రాజేందర్ , వివేక్ , గరికపాటి మోహన్ రావు, విజయశాంతి తదితరులు హాజరయ్యారు.ఏపీ నుంచి పార్టీ చీఫ్ సోమువీర్రాజుతోపాటు పలువురు నాయకులు హాజరయ్యారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలు, తీర్మానాలపై సమావేశాల్లో అజెండా ఖరారు చేయనున్నారు. నడ్డా పదవీకాలం పొడిగింపు గురించీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.