పార్టీ నాయకురాలు ఖుష్బూ సుందర్ ను జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఎంపిక చేసింది బీజేపీ. ఆమెతో పాటు మమతాకుమారి, డెలినా ఖోంగ్ డుప్ లను కూడా సభ్యులుగా నామినేట్ చేసింది. డీఎంకేలో చేరికతో రాజకీయ ప్రవేశం చేసిన ఖుష్బూ …తరువాత కాంగ్రెస్ లో చేరారు. పార్టీ అధికార ప్రతినిధిగా ఆ పార్టీలో కొంతకాలం పనిచేశారు. 2020లో కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన ఆమె… 2021లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. మహిళా కమిషన్ సభ్యురాలిగా తనను ఎంపిక చేయడంపై ఖుష్బూ ఆనందం వ్యక్తం చేశారు. గుర్తించిన మోదీ, పార్టీ ముఖ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
https://twitter.com/khushsundar/status/1630102122233761798?s=20