బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు.
https://twitter.com/ANI/status/1368139761152520196
బీజేపీ ఫైర్ బ్రాండ్ భోపాల్ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ అస్వస్థతకు గురయ్యారు. ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో.. వెంటనే ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రికి తరిలంచారు. ఈ విషయాన్ని ఎంపీ ఆఫీస్ స్పష్టం చేసింది. అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవ్వడంతో.. విషయం తెలుసుకున్న సిబ్బంది.. ఆమెను ఎయిర్ బస్లో ముంబైకి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కాగా, గత కొద్ది రోజులుగా ఆమె కాస్త అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
కాగా, మాలేగావ్ పేళుల్ల ఘటనలో.. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆమెను కుట్రపూరితంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన సంగతి తెలిసిందే. అనంతరం కోర్టు ఆమెను నిర్ధోషిగా ప్రకటించడంతో.. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్పై భోపాల్ నుంచి భారీ మెజర్టీతో గెలిచారు.