పార్టీ సభకు వచ్చిన వారి వల్ల ఇబ్బంది పడిన ఓ వ్యాపారిని ఆదుకుని తన ఔదార్యం చాటుకున్నారు కర్నాటక బీజేపీ నేత, ఎంపీ ప్రతాప సింహ. శుక్రవారం అమిత్ షా మైసూర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మైసూర్లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పెద్దఎత్తున జనం సభకు హాజరయ్యారు. వ్యాపారి సమీర్ అనే యువకుడు బహిరంగ సభ జరిగే మైదానంలో కూల్ డ్రింక్స్ విక్రయించాలనుకుని వ్యాన్ ను సిద్ధంగా పెట్టుకున్నాడు. అయితే పార్టీనే పంపిణీ చేస్తుందేమోనని కొందరు వాహనం నుంచి కూల్ డ్రింక్ సీసాలు అందుకున్నారు.అది అమ్మకానికి పెట్టినవని ఉచితం కాదని సమీర్ చెప్పినా వినలేదు. ఆసమయంలో ఎవరో రికార్డ్ చేసి వీడియోను సోషల్మీడియాలో పెట్టారు. చాలామంది ఆ వీడియోను వివిధ మాధ్యమాల్లో వైరల్ చేశారు. మరికొందరు పీఎంవోను, అమిత్ షాను కూడా ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేశారు. ఇది గమనించిన ప్రతాప సింహ… సమీర్ నెంబర్ అడుగుతూ ట్వీట్ చేశారు. కాసేపటికే మరో ట్వీట్ చేశారు ప్రతాప సింహ. తాను హసన్ సాబ్ కు 35 వేల రూపాయలు పంపానని తెలిపారు. ‘నేను సమీర్ హసన్ సాబ్ కి డబ్బు పంపాను, క్షమించండి సోదరా’ అని ట్వీట్ చేశారు.
ಸಮೀರ್ ಹಸನ್ ಸಾಬ್ ಗೆ ಹಣ ಕಳುಹಿಸಿದ್ದೇನೆ. Sorry brother. ಧನ್ಯವಾದಗಳು. pic.twitter.com/Ah1IVFmbuf
— Prathap Simha (@mepratap) April 30, 2023