బెంగాల్లో దారుణం.. బీజేపీ బూత్ ప్రెసిడెంట్పై కాల్పులు..!
బెంగాల్లో రాజకీయ దాడులు మళ్లీ మొదలయ్యాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఇప్పటికే అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే ఇక్కడ సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి రాజకీయ హత్యలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బీజేపీ, సీపీఐ నేతలే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తుంటారు. తాజాగా ఆదివారం నాడు నదియా జిల్లా హరింగట మున్సిపాలిటి 10వ వార్డుకు చెందిన బీజేపీ అధ్యక్షుడు దాస్పై దుండగులు తుపాకీతో కాల్చారు. దీంతో దాస్ తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్హెచ్12వ రహదారిపై ఉన్న ఓ టీ స్టాల్ సమీపంలో ఓ యువకుడు తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయి ఉన్నది గమనించామని.. అయితే అతడు హరింగట మున్సిపాలిటికి చెందిన బూత్ ఇంఛార్జి సంజయ్ దాస్గా గుర్తించామన్నారు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించామని.. ప్రస్తుతం దాస్ చికిత్స పొందుతున్నాడని తెలిపారు. అయితే బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.