ఆదిలాబాద్ లో రేణుక సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ప్రభుత్వం అక్కడి ప్రజల భూములు తీసుకొని నాలుగు సంవత్సరాలుగా ఎలాంటి పనులు ప్రారంభించలేదని ఆరోపిస్తూ…వారికి న్యాయం చేయాలంటూ స్థానిక బీజేపీ నాయకులు నిరసనకు దిగారు. ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసిందని.. కావున రైతుల నుంచి సేకరించిన భూములను తిరిగి వాళ్ళకే అప్పగించాలని పార్టీ నేత సుహాసినీ రెడ్డి డిమాండ్ చేశారు.
ఫ్యాక్టరీ నిర్మాణం కోసం అవసరమైన కరెంట్, నీటి వసతులు ఏర్పాటు చేయకుండా నాలుగేళ్లుగా భూమి మాత్రమే తీసుకుని ఫెన్సింగ్ వేసి రైతులను రోడ్డు మీదకు తెచ్చారని మండిపడ్డారు. రాష్ట్ర మంత్రి హోదాలో 2018 ఎన్నికలకు ముందు దసరా దీపావళి మధ్య కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభిస్తానని జోగు రామన్న మాట్లాడి మాట తప్పారని.. రైతులకు ఉద్యోగాలు, ఇళ్ళ స్థలాలు ఇస్తామని ఆశ పెట్టి భూములు కొనడం వాస్తవం కాదా? అని నిలదీశారు.
Go 40 ప్రకారం భూములు తీసుకున్న మూడేళ్లలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి, ఇప్పటికే సిమెంట్ ఉత్పత్తి కూడా ప్రారంభించాల్సిందని వ్యాఖ్యానించారు నాయకులు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)