బీజేపీ సీనియర్ నేత విషయంలో ఢిల్లీ హైకోర్టు ఈరోజు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఓ మహిళపై లైంగిక దాడి కేసులో బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. 2018వ సంవత్సరంలో తనపై షానవాజ్ హుస్సేన్ అత్యాచారం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు మేరకు మూడు నెలల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. బీజేపీ నేత తనపై అత్యాచారం చేశాడని, చంపేస్తానని బెదిరించాడని ఆమె ఆరోపించింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు పోలీసులు విముఖంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలు హైకోర్టును ఆశ్రయించింది. దాంతో ఈ కేసులో విచారణలో భాగంగా ఈరోజు ఢిల్లీ హైకోర్టు.. షానవాజ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.