ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు బెదిరింపు ఆరోపణలపై బీజేపీ నాయకుడు తజిందర్ పాల్ సింగ్ బగ్గాను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. న్యూఢిల్లీలోని జనక్పురి నివాసంనుంచి ఆయన్ని తీసుకెళ్లారు. రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం, మతపరమైన శత్రుత్వాన్ని ప్రోత్సహించడం మరియు నేరపూరిత బెదిరింపు ఆరోపణలపై పంజాబ్ పోలీసులు గత నెలలో బగ్గాపై కేసు నమోదు చేశారు. “ఈరోజు ఉదయం మా ఇంటికి వచ్చిన పోలీసు సిబ్బంది అరవింద్ కేజ్రీవాల్కు తజిందర్ చంపేస్తానని బెదిరించాడని” తజిందర్ తండ్రి ప్రీత్పాల్ సింగ్ బగ్గా అన్నారు.
తజిందర్ బగ్గాను పంజాబ్ పోలీసులు అక్రమంగా నిర్బంధించారని..కేజ్రీవాల్ హిట్లర్ లా వ్యవహరిస్తున్నారని…ఇలాంటి చర్యలు ఆయనకు నష్టం కలిగిస్తాయని బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తా అన్నారు. పంజాబ్ పోలీసులు కేజ్రీవాల్ ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
బగ్గాను అరెస్టు చేసిన తర్వాత, పంజాబ్ పోలీసులు అతన్ని రోడ్డు మార్గంలో మొహాలీకి తీసుకెళుతుండగా.. హర్యానా పోలీసులు అడ్డుకున్నారు, వారిని కురుక్షేత్రలోని థానేసర్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు.
ఉదయం 8 గంటల సమయంలో ఢిల్లీలోని జనక్పురిలోని తన ఇంటికి కొందరు వచ్చి తన కుమారుడిని తీసుకెళ్లారని బగ్గా తండ్రి ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు.