బీజేపీ నాయకురాలు, న్యాయవాది ప్రసన్నపై దాడి జరిగింది. తోటి న్యాయవాదులే ఆమెపై భౌతికదాడికి దిగారు. మల్కాజ్ గిరి కోర్టు ఆవరణలో ఉన్న తనతో కొందరు ఘర్షణకు దిగారని..మేకల శ్రీనివాసయాదవ్ అనే వ్యక్తి చేయి చేసుకున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ దాడిలో ప్రసన్నకు తీవ్ర గాయాలయ్యాయి. ముఖంపైన బలంగా కొట్టడంతో కన్నుపైభాగం దెబ్బతింది. ప్రస్తుతం ఆమె సన్ ఫ్లవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అటు ప్రసన్నపై భౌతికదాడిని నిరసిస్తూ పార్టీ కార్యకర్తలు నేరేడ్మెట్ క్రాస్ రోడ్డు దగ్గర సీఎం, ఎమ్మెల్యే మైనంపల్లి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)