బీజేపీ నేతకు డెత్ వార్నింగ్.. వారం రోజులే టైం.. ఊరు విడిచి వెళ్తావా.. చస్తావా..?
ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ బీజేపీ. కేంద్రంలో ప్రస్తుతం కొలువుదీరి ఉన్న పార్టీ కూడా ఇదే. అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ కూడా ఈ పార్టీనే.అలాంటి పార్టీలో ఉన్న అధికారులు,కార్యకర్తలకు ఎదురు మాట్లాడటం అంటే అంత సులువైన విషయం మాత్రం కాదు. అయితే బీజేపీ అధికారంలేని కొన్ని రాష్ట్రాల్లో పార్టీ అధికారులు,కార్యకర్తలపై వేధింపులు,దాడులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా వెస్ట్బెంగాల్లో అక్కడి అధికార టీఎంసీ పార్టీకి.. బీజేపీకి గత కొద్ది రోజులుగా పొలిటికల్ వార్ జరుగుతోంది. అయితే మాటల యుద్ధం అయితే బాగానే ఉండేది కానీ.. హత్యారాజకీయాలు అక్కడి బీజేపీ నేతలను కలవరపెడుతున్నాయి. దీదీకి గుడ్బై చెప్పి కమలం గూటికి చేరితే వారిని అంతం చేసేలా టీఎంసీ గుండాలను ఎగదోస్తోంది టీఎంసీ పార్టీ.
తాజాగా.. వెస్ట్బెంగాల్లోనే మరో బీజేపీ నేతకు డెత్ వార్నింగ్ ఇష్యూ చేశారు దుండగులు. వారం రోజుల్లో ఉన్న ఊరు విడిచి వెళ్తావా..? లేదా..? అంటూ హెచ్చరికలు జారీ చేశారు. వారం రోజుల్లో గ్రామం విడిచి వెళ్లకపోతే.. హతమారుస్తామంటూ.. బీజేపీ నేత అరిందం భట్టాచార్యకు వార్నింగ్ ఇచ్చారు గుర్తుతెలియని దుండగులు. ఇందుకు సంబంధించి గోడలపై రాతలు కూడా రాశారు. అతను నివసించే శాంతిపూర్ను ఏడు రోజుల్లో విడిచి వెళ్లాలంటూ గ్రామంలోని గోడలపై హెచ్చరికలు రాశారు. కాగా, ఈ సవాల్ను తాను స్వీకరిస్తున్నట్లు భట్టాచార్య తెలిపారు. తాను శాంతిపూర్ను వదిలి వెళ్లే సమస్యే లేదని ఆయన చెప్పారు. కాగా, పశ్చి బెంగాల్ అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో అధికార టీఎంసీ, బీజేపీ మధ్య రాజకీయ వివాదాలు, ఘర్షణలు పీక్ స్టేజ్కు చేరుకుంటున్నాయి.