మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వం ఎట్టకేలకు విజయాన్ని సాధించింది. మిత్ర పక్షాలు సహకారంతో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. కానీ చాలా చోట్ల బీజేపీ సిట్టింగ్ సీట్లు కోల్పోవడం కార్యకర్తలు, అభిమానుల్ని నిరాశ కల్పించండి ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ లో బిజెపి చాలా చోట్ల ఓటమి చవిచూసింది. దీనిమీద అనేక విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కానీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన విశ్లేషణ ఆసక్తికరంగా నిలుస్తోంది.
మొన్నటి పార్లమెంటు ఎన్నికల మీద ఉత్తరప్రదేశ్ బీజేపీ పార్టీ సమీక్ష చేసింది. రాష్ట్రంలోని అన్ని స్థాయిల పార్టీ నాయకులను లక్నోకి పిలిపించి లోతుగా చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అనేక అంశాల మీద సూటిగా మాట్లాడారు. బీజేపీ యూపీ కార్యవర్గ కమిటీ సమావేశంలో సీఎం యోగి మాట్లాడుతూ, ‘ప్రధాని మోదీ నాయకత్వంలో, యూపీలోని ప్రతిపక్షంపై నిరంతరం ఒత్తిడి పెంచాం. దీంతో 2014, 2017, 2019 ఎన్నికల్లో విజయం సాధించాం. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో ఓట్లు ప్రతిపక్షానికి బదిలీ అయ్యాయి. ఇది మన అతి విశ్వాసం వల్లే జరిగింది. మన అంచనాల్ని తలకిందులు చేసింది. ఓటమితో నీరసపడిన ప్రతిపక్షం.. ఇప్పుడు గెలుపును అందుకొని పుంజుకుంది’ అని తెలిపారు.
2014లో బీజేపీకి అనుకూలంగా వచ్చిన ఓట్ల శాతం, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 2024లో కూడా అదే స్థాయిలో ఓట్లు రావడంలో విజయం సాధించిందని ఆయన గుర్తు చేశారు. అయితే ఓట్లు మారడం, అతి విశ్వాసం తమ ఆశలను దెబ్బతీశాయని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రతిపక్షాల మీద యోగి విమర్శలు చేశారు.
ప్రతిపక్షాలు కులాల వారీగా ప్రజలను “విభజించే పాపం”కు పాల్పడుతున్నాయని ఆయన హెచ్చరించారు. ఇది ఎన్నికల సమయంలో జరిగిందని చెబుతూ , ..ఐక్యంగా ఉంటే అతిపెద్ద శక్తులు కూడా తమ ముందు పతనమవుతాయని ఆయన స్పష్టం చేశారు.
సోషల్ మీడియా గొప్పతనాన్ని యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకోవాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. సోషల్ మీడియాను ఉపయోగించుకుని ప్రతిపక్షాలు, విదేశీయులు కుట్రకు పాల్పడ్డారని, అందులో విజయం సాధించారని ముఖ్యమంత్రి చెప్పారు. అయితే బీజేపీకి జాతీయవాద దృక్పథం ఉందని ఆయన పేర్కొన్నారు.
ప్రతిపక్షాల ప్రచార వ్యూహం కూడా దెబ్బతీసిందని యోగి అంగీకరించారు. ఇండియా కూటమి నాయకులు లోక్సభ ఎన్నికల ప్రచారంలో రిజర్వేషన్లు రద్దు అవుతాయంటూ బీజేపీపై దాడి చేశారని ఆయన గుర్తు చేశారు. ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, “సోషల్ మీడియాలో ఏమి జరుగుతుందో బిజెపి కార్యకర్తలు చూడాలి. మనం వెంటనే పుకార్లను తిప్పికొట్టాలి. షెడ్యూల్డ్ కులాల గొప్ప వ్యక్తుల గురించి బిజెపి అభిప్రాయాల గురించి మాట్లాడాలి” అని చెప్పారు. “2019 లో మనం ఓడించాము. మనం కులం, మతం లేదా మతం ఆధారంగా వివక్ష చూపడం లేదు, 80 కోట్ల మందికి కులం లేదా మతం ఆధారంగా ఉచిత రేషన్ అందడం లేదు” అని ముఖ్యమంత్రి తెలిపారు.కరోనా మహమ్మారి సమయంలో కూడా, ఆకలి సంబంధిత మరణాలు, ఆత్మహత్యలు జరగలేదని, ప్రధాని మోదీ నాయకత్వంలో దీనిని విజయవంతంగా నిర్మూలించామని ఆదిత్యనాథ్ గుర్తు చేశారు.
మొత్తం మీద ఉత్తరప్రదేశ్ బిజెపి శ్రేణులను ఉత్సాహపరుస్తూ యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు మొన్నటి ఎన్నికల్లో ఓటమికి కారణాలని కొండ బద్దలు కొట్టినట్లుగా ఆయన చెప్పేశారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు కలిసి పనిచేయాలని, గెలుపు సాధించాలని హితవు పలికారు.