వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇతర పార్టీలతో పొత్తులకు బీజేపీ కసరత్తు వేగవంతం చేస్తోంది. అప్నాదళ్, నిషద్ పార్టీలతో పొత్తులు దాదాపు ఖరారయ్యాయి. నిషద్ పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్లబోతున్నామని పార్టీ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ తెలిపారు. అయితే అప్నాదళ్, నిషద్ పార్టీల మధ్య సీట్ల ఒప్పందం వివరాలు చెప్పేందుకు నిరాకరించారు. యూపీ బీజేపీ ఎన్నికల ఇన్చార్జి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సైతం పొత్తుల విషయాన్ని ధ్రువీకరించారు.

file photo