కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉదయ్పూర్లోని పార్టీ చింతన్ శివిర్లో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం మైనారిటీలను క్రూరంగా హింసిస్తోందని, మహాత్మా గాంధీని చంపిన హంతకులను కీర్తిస్తోందని అన్నారు. ‘మాక్సిమం గవర్నెన్స్, మినిమం గవర్నమెంట్’ అనే నినాదంతో ప్రధాని మోదీ, ఆయన సహచరులు నిజంగా ఏ ఉద్దేశంతో పనిచేస్తున్నారో స్పష్టంగా అర్థమైందని.. దాని అర్థం దేశాన్ని శాశ్వతంగా రెండు వర్గాలుగా చేసే విధంగా ఉన్నారని సోనియా అన్నారు.
సోనియా గాంధీ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీలో మార్పులు అవసరం, మనం పని చేసే విధానాన్ని మార్చుకోవాలి, పార్టీ మనకు చాలా ఇచ్చింది, తిరిగి చెల్లించాల్సిన సమయం ఆసన్నమైనందున మనం సంస్థను వ్యక్తిగత ఆశయాల కంటే ఎక్కువగా ఉంచాలి” అని గాంధీ అన్నారు.