గోదావరి ముంపు ప్రాంతాల పరిశీలనకు వెళ్లిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కాన్వాయ్ పై దాడి జరిగింది. దాడిలో ఆయన కారు అద్దాలు ద్వంసమయ్యాయి. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండికి వెళ్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. అదే సమయంలో ఆయనకు చెప్పుల దండవేసేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు యత్నించారు.అయితే పోలీసులు అడ్డుకుని భారీ భద్రతతో ఆయన్ని అక్కడినుంచి సురక్షితంగా పంపించేశారు.
అటు అర్వింద్ పై టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని బీజేపీ ఖండించింది.తమ ఎంపీపై జరిగిన దాడి ముమ్మాటికీ పిరికిపంద చర్యేనని పార్టీ చీఫ్ సంజయ్ అన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎదుర్కునేసత్తాలేకనే ఇలా దాడులు చేస్తున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. బీజేపీకి వస్తున్న ఆదరణ జీర్ణించుకోలేక దాడులకు దిగడం హేయమైన చర్య అని…ప్రజలు అన్ని గమనిస్తున్నారని… వాళ్లే తగిన బుద్ధి చెబుతారని ఈటల హెచ్చరించారు.