బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్మల్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. బోధ్ మండలంలో పార్టీ మండలాధ్యక్షుడు సుభాష్ సూర్య ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. పార్టీ కార్యాలయంలో జెండాను ఎగరవేశారు. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ప్రతిఒక్కరూ పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. స్థానిక బీజేపీ నాయకులు గొర్ల రాజుయాదవ్, కట్టా భూమేశ్, సకటి దశరథ్, సోలంకి శ్రీకాంత్,శేఖర్ రంజిత్ , పెర్క రమేశ్, కె. శ్రీనివాస్, గాజువాక శ్రీనివాస్, బోరే రవీందర్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)