అవినీతికి పాల్పడిన వారిని భారతీయ జనాతా పార్టీ సమర్థించదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. అయితే ఈటలను బీజేపీలో చేర్చుకోవడమే అంశం పార్టీ హైకమాండ్ చూసుకుంటుందన్నారు. ఈటెల ఎపిసోడ్ పై స్పందించిన అరవింద్…. కేసీఆర్ దిగజారిన రాజకీయాలు చేస్తున్నారన్నారు. కరోనాతో జనం పిట్టల్లా రాలుతుంటే… కేసీఆర్ చేతులెత్తేశారన్నారు. అసలు కేబినెట్లో పనిచేసే ఏకైక మంత్రి ఈటల రాజేందర్ అని అరవింద్ వ్యాఖ్యానించారు.