క్రైస్తవ మతమార్పిడి మాఫియా వేధింపులకు బలైన లావణ్య ఆత్మహత్య ఘటనపై విచారణకు బీజేపీ ఓ కమిటీని వేసింది. క్రైస్తవమతంలోకి మారాలని ఒత్తిడి తేవడం వల్లే ఆత్మహత్య చేసుకుందని మరణ వాంగ్మూలం కూడా ఇచ్చినట్టు ఆమె తల్లిదండ్రులూ ఆరోపించారు. జనవరి 19న లావణ్య ఆత్మహత్య చేసుకుంది. తంజావూరు వెళ్లి నిజాలు తెలుసుకుని నివేదిక ఇవ్వాల్సిందిగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కమిటీ వేసినట్టు బీజేపీ ఓ ప్రకటనలో తెలిపింది. బీజేపీ ఎంపీ సంధ్యారే, మహిళానేతలు విజయశాంతి, చిత్రా వాఘ్, గీతా వివేకానంద కమిటీలో ఉన్నారు. క్రైస్తవ మతంలోకి మారమని చిత్రహింసలు పెట్టినందుకే చనిపోతున్నట్టు లావణ్య అన్న 44 సెకండ్ల వీడియో వైరల్ అయింది.