అంతర్జాతీయ పార్టీగా బీజేపీ.. అమిత్ షా ప్లాన్ వేస్తున్నారట..!
When HM was party chief, he had visited the state. We were sitting & talking. We said that we've so many states(BJP govt in several states). He said Sri Lanka & Nepal still remain. He said that we've to take party to Sri Lanka & Nepal too. We've to win there too: Tripura CM(13.2) pic.twitter.com/fWHiJpjlSH
— ANI (@ANI) February 15, 2021
ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కల్గిన బీజేపీ పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశ వ్యాప్తంగా అత్యధిక రాష్ట్రాల్లో బీజేపీ అధికారాన్ని చేపడుతోంది. అంతేకాదు.. పొరుగు దేశాల్లో కూడా బీజేపీ పాగా వేసి.. అంతర్జాతీయ పార్టీగా అవతరించబోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని త్రిపుర సీఎం బిప్లబ్ దేబ్ తెలిపారు. ఓ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన సీఎం బిప్లబ్.. బీజేపీని దేశ వ్యాప్తంగానే కాదు.. పొరుగు దేశాలైన శ్రీలంక,నేపాల్లోనూ విస్తరించే పనిలో అమిత్ షా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2018లో త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు జరిగే ముందు.. ఓ సమావేశం గురించి మాట్లాడుతుండగా.. అప్పట్లో బీజేపీ చీఫ్గా ఉన్న అమిత్ షా.. విదేశాల్లో కూడా పార్టీ విస్తరణ గురించి చర్చించినట్లు తెలిపారు.
తాము రాష్ట్ర గెస్ట్ హౌజ్లో మాట్లాడుకుంటుండగా.. అప్పటి ఈశాన్య జోన్ కార్యదర్శి జామ్వాలా మాట్లాడుతూ.. దేశంలోని అనేక రాష్ట్రాల్లో మనం అధికారంలోకి వచ్చామన్నారు. అదే సమయంలో స్పందించిన అమిత్ షా.. ఇంకా శ్రీలంక,నేపాల్ మిగిలిఉన్నాయని అన్నారని సీఎం బిప్లబ్ దేబ్ తెలిపారు. ఆ రెండు దేశాల్లో కూడా పార్టీని విస్తరింప జేయాలని.. అనంతరం అక్కడ కూడా అధికారం చేపట్టాలని అమిత్ షా వ్యాఖ్యానించినట్లు బిప్లబ్ తెలిపారు. ప్రస్తుతం సీఎం బిప్లబ్ దేబ్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి.